ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్(KKR vs LSG) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు అదిరిపోయే శుభారంభం చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్క్రమ్(47) కేకేఆర్ బౌలర్లను చితక్కొట్టారు. ఈ క్రమంలో 10 ఓవర్లకు స్కోరు 95/0గా నమోదైంది. హాఫ్ సెంచరీకి చేరువైన మార్క్రమ్ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. అదే ఓవర్లో ఫోర్ బాది మార్ష్ అర్ధ శతకం అందుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన నికోలస్ పూరన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్లో మార్ష్ కూడా అదరగొట్టాడు. దీంతో ఈ జంట 11-15 ఓవర్ల మధ్య ఏకంగా 64 పరుగులు రాబట్టింది. దూకుడుగా ఆడుతున్న మార్ష్(81; 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లు)ను రస్సెల్ పెవిలియన్ పంపించాడు. పూరన్ మాత్రం (87*; 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు వచ్చాయి. ఇక కోల్కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టారు.