Wednesday, October 23, 2024
HomeఆటManchiryala: కిక్ బాక్సింగ్ క్రీడాకారిణికి సన్మానం

Manchiryala: కిక్ బాక్సింగ్ క్రీడాకారిణికి సన్మానం

ఛాంపియన్ కు..

నోయిడాలో ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో మంచిర్యాలకు చెందిన కీర్తి అగర్వాల్ బంగారు పతకం సాధించింది. ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిట్నెస్ సెంటర్ కుమార్ మాట్లాడుతూ.. కీర్తి అగర్వాల్ ను ఘనంగా సత్కరించి అభినందించామని. ఇంకా ఎన్నో ఉన్నత విజయాలు సాధించాలని మంచిర్యాల ఫిట్నెస్ సెంటర్ తరపున మేము కోరుకుంటూ కీర్తి అగర్వాల్ ని సన్మానించామన్నారు.

- Advertisement -

ఈ జాతీయ స్థాయి క్రీడల కోచింగ్ ఇచ్చిన, చిలువేరు రాజేష్ ను కూడా సన్మానించామని. యువత అంతా కూడా క్రీడల వైపు మొగ్గుచూపి ఉన్నత స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నామన్నారు. యువత చెడు మార్గం పట్టకుండా దుర్రాలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలి, అప్పుడే యువత విజయాల వైపు అడుగులు వేస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుల ఆంజనేయులు, రామన్న శ్రీనివాస్, తోట వెంకటేశ్వర్లు, శ్రీనాథ్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రకాంత్, అశోక్, లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి, ప్రభాకర్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News