Sunday, July 7, 2024
HomeఆటPravallika Reddy to play U-17: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ప్రవల్లిక రెడ్డి

Pravallika Reddy to play U-17: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ప్రవల్లిక రెడ్డి

త్రివేండ్రం లో జరిగే పోటీలకు ప్రవల్లిక

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం సోమప్ప నగర్ (సాయి నగర్)కు చెందిన వైసీపీ నాయకుడు, ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నిర్వాహకుడు పాల శ్రీనివాస రెడ్డి కూతురు ప్రవల్లిక రెడ్డి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక అయింది. ప్రవల్లిక రెడ్డి ఎస్జీఎఫ్యు 17 క్రికెట్ టోర్నమెంట్ లో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జనవరి 28, 29, 30 తేదీలలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగాయి. ఇందులో ప్రవల్లిక ఉత్తమ అల్ రౌండ్ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక అయింది. త్వరలో కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలో జరిగే పోటీలలో ప్రవల్లిక రెడ్డి పాల్గొననుంది. ప్రవల్లిక రెడ్డి ఎంపిక పట్ల తల్లిదండ్రులు పాల శ్రీనివాస రెడ్డి, హేమ శ్రీరెడ్డి, మిత్రులు, ఎమ్మిగనూరు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రవల్లికను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News