Sunday, May 4, 2025
Homeఆటచెన్నైపై ఆర్సీబీ ఉత్కంఠభరిత విజయం.. 2 పరుగుల తేడాతో ధోనీ సేన ఓటమి..!

చెన్నైపై ఆర్సీబీ ఉత్కంఠభరిత విజయం.. 2 పరుగుల తేడాతో ధోనీ సేన ఓటమి..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠభరిత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై ఆర్సీబీ కేవలం 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో విజయం చెన్నైకి చుట్టూ తిరిగినా.. ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది.

- Advertisement -

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, చెన్నై ఛేజింగ్‌లో గొప్ప పోరాటం చూపించినప్పటికీ చివర్లో కొద్ది తేడాతో ఓటమిని చవిచూసింది. చెన్నైకి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమయ్యాయి. కానీ కేవలం 13 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపింది.

చెన్నై ఇన్నింగ్స్‌ తరహాలో ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా సంచలనాత్మక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఓ దశలో చెన్నై గెలుస్తుందని ఖచ్చితంగా అనిపించినా… ఫలితం మాత్రం మారింది. మాత్రే అద్భుతంగా ఆడి 94 పరుగులతో రనౌట్‌గా వెనుదిరిగాడు.

48 బంతుల్లో అతడు 5 సిక్సులు, 9 ఫోర్లతో చెలరేగాడు. మరోవైపు జడేజా చివరి వరకు క్రీజులో నిలిచి పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. అతడు 45 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి అత్యుత్తమంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడి స్పెల్ చెన్నైని ఒత్తిడిలోకి నెట్టింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానంతో టాప్‌కి దూసుకెళ్లింది. ఇక చెన్నై మాత్రం వరుస పరాజయాలతో అట్టడుగున నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News