Friday, June 6, 2025
HomeఆటRCB Compensation: తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం

RCB Compensation: తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం

బెంగళూరులోని(Bengaluru) చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ(RCB)కప్ కొట్టిన ఆనందంలో విజయోత్సవం వేడుకలు విషాద వేడుకలగా మారడం అందరినీ కలిచివేసింది. తాజాగా మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ దురదృష్టకర ఘటన ఆర్సీబీ ఫ్యామిలీకి తీవ్ర వేదన కలిగించిందని పేర్కొంది. మృతి చెందిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కేర్స్ పేరుతో ఫండ్‌ను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. తమ ఫ్యాన్స్‌ ఎప్పటికీ తమ హృదయంలో ఉంటారని, తాము చేసే ప్రతి పనిలోనూ ఇది ప్రతిబింబిస్తుందని చెప్పింది.

కాగా బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఇరుకైన గేట్లు దగ్గరకు ఒక్కసారిగా అభిమానులు గుమికూడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddha Ramaiah) మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం(KSCA)కూడా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అదనపు సాయం అందజేయనున్నట్టు పేర్కొంది.

మరోవైపు ఈ దుర్ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరుపై ఆరా తీసింది. . ఈ సుమోటో కేసును రిట్ పిటిషన్‌గా నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది.

ఈ దుర్ఘటనపై మాత్రం రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. సరైన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపిస్తూ, బాధ్యుల రాజీనామాకు డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ముందే 10 మంది చనిపోయారని.. మృతుల్లో చిన్న పిల్లలు కూడా తనను కలిచివేసిందని వాపోయారు.

https://x.com/RCBTweets/status/1930568180197736472

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News