Rinku Singh Wedding postponed: టీమిండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇరు కుటుంబసభ్యుల పెద్దలు ఈ ఏడాది నవంబర్ 19న వీరిద్దరి పెళ్లి ముహుర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన భార్య ఎంపీ డింపుల్ యాదవ్, సీనియర్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా, తదితరులు పాల్గొన్నారు.
అయితే ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఎందుకంటే నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. సౌతాఫ్రికాకు వెళ్లే టీ20 జట్టులో రింకూ కూడా ఉండనున్నారు. ఏకంగా ఐదు టీ20లు ఆడనుండటంతో కీలక ఆటగాడైన రింకూ సింగ్ జట్టులోకి ప్రాధాన్యత లభించనుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరికి పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
రింకూ, ప్రియా ఓ పెళ్లిలో కలుసుకుని ప్రేమలో పడ్డారు. ప్రియా సరోజ్ 1998 నవంబర్ 23న జన్మించగా.. 25 ఏళ్ల వయసులో లోక్ సభకు ఎన్నికయ్యారు. గతంలో సుప్రీంకోర్టు లాయర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రింకూ సింగ్ టీమిడింయాతో పాటు IPL 2025లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్నాడు. 2023లో జరిగిన ఐపీఎల్ లో భాగంగా గుజారత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో చివరి 5 బంతులకు 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్ జట్టును గెలిపించాడు. అనంతరం టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇప్పటివరకు 2 వన్డేలు, 33 టీ20లు ఆడాడు.
Rinku Singh: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి వాయిదా
- Advertisement -