Friday, October 25, 2024
HomeఆటSports policy by November month end: న‌వంబ‌ర్ నెలాఖ‌రులోగా స్పోర్ట్స్ పాల‌సీ

Sports policy by November month end: న‌వంబ‌ర్ నెలాఖ‌రులోగా స్పోర్ట్స్ పాల‌సీ

స్పోర్ట్స్ కు..

తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాల‌సీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైన‌ల్ డ్రాఫ్ట్‌)ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం రూపొందించే పాల‌సీ దేశంలోనే అత్యుత్త‌మ పాల‌సీగా ఉండాల‌ని, అందుకు విస్తృత అధ్య‌య‌నం, నిపుణులు, క్రీడాకారుల‌తో విస్తృత స్థాయిలో సంప‌ద్రింపులు చేయాల‌ని ఆయ‌న సూచించారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ పాల‌సీపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా వ‌న‌రుల‌ను స‌మ‌ర్థంగా వినియోగించుకోవాల‌ని, ఇప్ప‌టికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల‌ను ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి సంబంధించిన బిల్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రూపొందించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాల‌సీలో భాగ‌మైన యంగ్ ఇండియా ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ (YIPESU), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడ‌మీ (YISA), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు (SATG) సంబంధించి ప‌లు వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు. అందులో చేయాల్సిన మార్పులుచేర్పుల‌ను ముఖ్య‌మంత్రి సూచించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాల‌సీ దేశంలోనే అత్యుత్త‌మంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. త‌న ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డి కొరియా నేష‌న‌ల్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీని సంద‌ర్శించిన సంద‌ర్భంగా గుర్తించిన అంశాలను ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు.. రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి ద‌క్షిణ కొరియా క్రీడా వ‌ర్సిటీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు.

- Advertisement -

ద‌క్షిణ కొరియా క్రీడా వ‌ర్సిటీతో పాటు క్రీడా రంగంలో ప్ర‌పంచంలోనే అత్యుత్తమైన‌దిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ అన‌స‌రిస్తున్న విధానాల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. మ‌రో ప‌ది రోజుల్లోనే స్పోర్ట్స్ పాల‌సీకి సంబంధించిన గ‌వ‌ర్నింగ్ బాడీని ఖ‌రారు చేయాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్ ను వెంట‌నే త‌యారు చేయాలన్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో నేష‌న‌ల్ గేమ్స్ కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ను సంప్రదించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ( క్రీడ‌లు) ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ శివ‌సేనా రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి షాన‌వాజ్ ఖాసీం, ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, రాష్ట్ర క్రీడ‌ల శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News