ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ -1 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆర్సీబీ ఘన విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. కానీ ఈ మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Kohli) ప్రవర్తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అసలు జరిగిందంటే.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్ సోదరుడైన ముషీర్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ముషీర్ ఖాన్ను వాటర్ బాయ్ అంటూ చులకనగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు, క్రికెట్ అభిమానులు కోహ్లీ తీరుపై మండిపడుతున్నారు. ఓ స్టార్ బ్యాటర్ అయి ఉండి యువ ఆటగాడిని ఇలా స్లెడ్జింగ్ చేయడం ఏంటని ప్రశ్రిస్తున్నారు.

మరోవైపు కొందరు ఆర్సీబీ అభిమానులు కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో కోహ్లీ తన బ్యాట్ను ముషీర్ ఖాన్కు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముషీర్ ఖాన్కు కూడా విరాట్ కోహ్లీ ఆరాధ్య క్రికెటర్ అని గుర్తు చేశారు. ముషీర్ ఖాన్ ఏకాగ్రత దెబ్బతీయడానికే ఇలా స్లెడ్జింగ్ చేసి ఉంటారని చెబుతున్నారు. కీలకమైన మ్యాచ్ల్లో గెలుపు కోసం ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేయడం సహజమేనని వాదిస్తున్నారు.