Saturday, November 15, 2025
Homeటెక్నాలజీFlipkart: పండుగ వేళ డబుల్‌ బొనంజా.. సరికొత్త ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన ఫ్లిప్‌కార్ట్‌.. !

Flipkart: పండుగ వేళ డబుల్‌ బొనంజా.. సరికొత్త ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించిన ఫ్లిప్‌కార్ట్‌.. !

Flipkart Exchange Programme: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయన్సెస్‌తో సహా 26 ఉత్పత్తి విభాగాల్లో ఒక వినూత్న ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులకు తక్షణ విలువ, మెరుగైన అప్‌గ్రేడ్లను అందించడానికి దీన్ని రూపొందించింది. ఇందుకోసం సరికొత్త ఏఐ-ఆధారిత 10-దశల డయాగ్నొస్టిక్ టూల్ ఏర్పాటు చేస్తోంది. ఇది రియల్‌ టైమ్‌ , పారదర్శక ఉత్పత్తి విలువలను నిమిషాల్లో అందిస్తుంది.

- Advertisement -

ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ ఇవే..

1. ఈ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా కస్టమర్లు తమ పాత ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు వంటి వస్తువులను విస్తృత శ్రేణి కొత్త ఉత్పత్తుల కోసం ఎక్స్ఛేంజ్‌ చేయవచ్చు.

2. కస్టమర్లు తమ పాత ఉత్పత్తుల వేగవంతమైన, ఖచ్చితమైన, పారదర్శక విలువను ఈ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ నిర్ధారిస్తుంది.

3. ఈ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ పనికిరాని గృహ ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల పునర్వినియోగం, రీసైక్లింగ్ ను ప్రోత్సహిస్తుంది. వాటిని “ఇంట్లో కరెన్సీ”గా మారుస్తుంది.

4. ప్రీమియం ఉత్పత్తులకు అందుబాటును పెంచడం, చిన్న పట్టణాల్లోనూ ప్రీమియం ఉత్పత్తులు కొనే వెసులుబాటు కల్పించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేసింది.

5. రాబోయే దసరా, దీపావళి షాపింగ్ సీజన్లో కస్టమర్లకు ఎక్కువ ఎక్స్‌ఛేంజ్‌ వాల్యూ ఇచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ ఉపయోగపడుతుంది.

కాగా, స్థిరమైన వినియోగాన్ని పెంచే తెలివైన, సాంకేతికతతో కూడిన రీకామర్స్ వ్యవస్థను నిర్మించడానికి ఫ్లిప్‌కార్ట్ ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ & రీ-కామర్స్ బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా రాబోయే పండుగ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కస్టమర్లు తమ పాత వస్తువులను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకొని కొత్త వస్తువులను భారీ తగ్గింపుతో పొందవచ్చని స్పష్టం చేశారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/new-dialysis-centers-in-telangana/

బిగ్‌ బిలియన్‌ డేస్‌లో అధిరిపోయే ఆఫర్లు..

కాగా, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ సెప్టెంబర్‌ 22 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా వివిధర కాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌ను అందించనుంది. ఈ సేల్‌లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా సిద్ధం చేసింది. ఈ సంవత్సరం సేల్‌ను గతేడాది కంటే పెద్ద ఎత్తున నిర్వహించాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సేల్‌ సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభం కానుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్ సభ్యులు, బ్లాక్ సభ్యులకు 1 రోజు ముందుగానే అనగా సెప్టెంబర్‌ 21 నుండే ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, టాబ్లెట్‌ల వరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై డిస్కౌంట్లను పొందొచ్చు. కంపెనీ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad