UPI UPDATES: ఇప్పుడు యుపిఐ లావాదేవీలు మరింతగా వేగంగా కానున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఏదైనా యుపిఐ యాప్ను ఉపయోగిస్తున్నారా.. మీకు ఒక ముఖ్యమైన వార్త ఉంది. 2025 జులై 16 నుండి దేశవ్యాప్తంగా UPI చెల్లింపు గతంలో కంటే వేగంగా మారింది. యుపిఐ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు డబ్బు పంపడం లేదా స్వీకరించడం మరింత సులభం, వేగంగా మారింది. గతంలో యుపిఐ ద్వారా లావాదేవీలు 25 నుండి 30 సెకన్లు పట్టేవి, ఇప్పుడు ఈ పని కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతుంది. అంటే ఇప్పుడు మీరు డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రక్రియ కేవలం 15 సెకన్లలో లావాదేవీలు పూర్తి అవుతాయి.
ఏదైనా కారణం చేత చెల్లింపు విఫలమైతే, లావాదేవీ విజయవంతమైందో లేదో ఇప్పుడు మీకు 10 సెకన్లలోపు తెలుస్తుంది.
గతంలో నిలిచిపోయిన లావాదేవీని నిర్ధారించడానికి 90 సెకన్ల వరకు పట్టేది, ఇప్పుడు ఈ పని 45 నుండి 60 సెకన్లలో పూర్తవుతుంది.
మీరు ఒక దుకాణంలో QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా రూ.500 చెల్లిస్తున్నారని అనుకుందాం. గతంలో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 30 సెకన్లు పట్టేది. ఇప్పుడు ఈ పని స్కానింగ్ నుండి చెల్లింపు నిర్ధారణ వరకు కేవలం 15 సెకన్లలో పూర్తవుతుందన్న మాట.
ఇప్పుడు ఏదైనా కారణం చేత నెట్వర్క్ విఫలమైతే, లావాదేవీ UPI సిస్టమ్కు చేరకపోతే, సిస్టమ్ స్వయంగా ఆ లావాదేవీని విఫలమైనట్లుగా పరిగణిస్తుంది. ఇది వినియోగదారుడు లావాదేవీ స్థితిని మళ్లీ మళ్లీ తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా వేగంగా యుపిఐ లావాదేవీలు కావడమే కాకుండా, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్లయితే అది వెంటనే తెలుస్తుంది. ఇంతకుముందు ఒక పేమెంట్ చేస్తే, అది ఆగిపోయినట్లయితే పూర్తి అయ్యిందా లేదా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటి సమస్య లేదు. వినియోగదారులకు ఎంతో సురక్షితమైన యుపిఐ లావాదేవీలు ఇప్పుడు జరుగుతాయి. మీకు కేవలం పది సెకండ్లలోనే మీరు జరిపిన లావాదేవీల గురించి నిర్ధారణ తెలుస్తుంది. ఇంతకుముందు ఇది పేమెంట్ విషయంలో డైలమా ఉండేది, ఇప్పుడు అలాంటి సమస్యలకు ఎన్పిసిఐ సంస్థ ముగింపు పలికింది. రాబాయో రోజుల్లో యుపిఐ లావాదేవీలు మరింత అధునాతనంగా, వేగంగా మారనున్నాయి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.