Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్BJP vs Congress: నాంపల్లిలో కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

BJP vs Congress: నాంపల్లిలో కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanaka Gandhi)పై బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ(BJP) ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్(Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు భారీగా చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad