KTR : హైదరాబాద్ను టెక్ హబ్గా మరింత బలోపేతం చేసే దిశగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరో అడుగు వేశారు. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ తమ కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించాలని ‘ఎక్స్’ వేదికగా కోరారు. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్ ఇటీవల భారత్లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని, సెప్టెంబర్లో ఇక్కడ పర్యటిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు.
ALSO READ: YS Viveka Murder : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1 కు సుప్రీం బెయిల్
ఓపెన్ ఏఐ ఛాట్జీపీటీ వంటి వినూత్న సాంకేతిక ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ హైదరాబాద్లో స్థిరపడితే స్థానిక టెక్ కమ్యూనిటీకి, స్టార్టప్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. శామ్ అల్ట్మన్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ టెక్ రంగంలోని అవకాశాలను అన్వేషించే అవకాశం ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.


