RAINS IN HYD: సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన ఈ వర్షం మోండా మార్కెట్, రేజిమెంటల్ బజార్, మారేడుపల్లి, అడ్డగుట్ట, తుకారామ్ గేట్, మెట్టుగూడ, సీతాఫల్ మండి, బౌద్ధ నగర్, బన్సీలాల్ పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట్, రసూల్పురా, బోయిన్పల్లి, కార్ఖానా, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, మౌలాలి, మల్కాజ్గిరి, తోపా తదితర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది.
వాతావరణ శాఖ హెచ్చరిక :
ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, చాలాప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ ఇప్పటికే పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం తో పాటుగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పాత భవనాల వద్దకు లేదా చెట్ల కింద ఉండరాదని సూచించింది.
అప్రమత్తంగా ఉండండి :
ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఈ పరిస్థితి మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. సురక్షితంగా ఉండటానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
RAINS IN HYD: భాగ్యనగరంలో భారీ వర్షం
- Advertisement -