RS Brothers Vanasthalipuram: వస్త్ర రంగంలో రిటైల్ షాపింగ్ పరంగా తనదైన ముద్ర వేసుకున్న ఆర్ఎస్ బ్రదర్స్.. క్రమక్రమంగా షోరూంలను విస్తరిస్తోంది. హైదరాబాద్ నగర వాసులకు మరింత దగ్గర అయ్యేందుకు ఆర్ఎస్ బ్రదర్స్ తన అతిపెద్ద 15వ షోరూమ్ను వనస్థలిపురంలో ఈ రోజు(సెప్టెంబర్ 26న) ప్రారంభించింది. పనామా గోడౌన్స్ సమీపంలోని బొమ్మిడి ఎలైట్ టవర్స్లో నూతన షోరూం ప్రారంభోత్సవంలో అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు పాల్గొని సందడి చేశారు.

సంప్రదాయం, విశ్వసనీయత, సరికొత్త ఫ్యాషన్లకు కేరాఫ్ ఆర్ఎస్ బ్రదర్స్ అని నాగచైతన్య అన్నారు. పండుగలు మొదలుకొని వివాహాది శుభకార్యాలకు కుటుంబసమేతంగా కలిసి వచ్చి షాపింగ్ చేసేలా అన్ని రకాల కలెక్షన్స్, వైవిధ్యభరితమైన మోడల్స్.. ఆర్ఎస్ బ్రదర్స్లో అలరిస్తాయని శోభిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య, శోభితను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

ఈ సందర్భంగా ఆర్.ఎస్. బ్రదర్స్ సంస్థాపకుడు, ఛైర్మన్ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘సంప్రదాయాలను, ఫ్యాషన్లను ప్రతిబింబించే విధంగా తమ 15వ షోరూమ్ను వనస్థలిపురంలో నెలకొల్పడం గర్వకారణంగా ఉంది. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికీ ఇది షాపింగ్ గమ్యం అవుతుందని మా గట్టి నమ్మకం.’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. దసరా, దీపావళి, వివాహాది శుభకార్యాల సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వివిధ ప్రాంతాల పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు, మెన్స్, కిడ్స్ డిజైనర్ వేర్స్ సరసమైన ధరల్లో లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.


