గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఒకరు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు దాఖలు
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం ఒక నామినేషన్ దాఖలయ్యింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. అభ్యర్థి నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ స్వీకరించారు. కాగా బుధవారం వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ దాఖలు చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి..
వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా మూడో రోజు బుధవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ తెలిపారు. హనుమకొండ జిల్లా, ధర్మసాగర్ మండలానికి చెందిన బంకరాజు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ వేశారని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఆమె తెలిపారు. నల్గొండకు చెందిన పన్నాల గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని ఆమె పేర్కొన్నారు. అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Karimnagar, Nalgonda:మూడో రోజు నాలుగు నామినేషన్లు
ఎమ్మెల్సీ ..
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES