Friday, September 20, 2024
HomeతెలంగాణPrakash Goud: అధికారం మాదే

Prakash Goud: అధికారం మాదే

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని అలాగే మళ్లీ తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదంతో గెలవబోతున్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు శంషాబాద్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దూడల వెంకటేశ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరైనారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

- Advertisement -

24 గంటల పాటు ఉచిత విద్యుత్తు రైతు బీమా రైతు బంధు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తదితర పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నామని తెలిపారు. మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతారని వెల్లడించారు. నియోజకవర్గం లో చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజల్లోకి వెళ్లి పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ పథకాలను వివరించి వారిని చైతన్యం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్.సుష్మా మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కౌన్సిలర్ ఆయిల్ కుమార్, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, కౌన్సిలర్ జాంగిర్ ఖాన్, కౌన్సిలర్ అజయ్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మురళీకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాజ్ బాబా, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్టీ పారేపల్లి శ్రీనివాస్ గౌడ్, పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News