Sunday, October 6, 2024
HomeతెలంగాణMadhavaram krishna Rao: దేశానికే దిక్సూచి మన కేసీఆర్

Madhavaram krishna Rao: దేశానికే దిక్సూచి మన కేసీఆర్

60 ఏళ్లుగా పూర్తి కాని పనులు 10 ఏళ్లలో పూర్తి చేసుకున్నాం

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఒక కోటి 25 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో ప్రధానంగా సిసి రోడ్ నిర్మాణ పనులు కొరకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత పది ఏళ్ల కాలం నుంచి కూకట్పల్లి నియోజకవర్గంను వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామని.. 60 ఏళ్లుగా కానీ పనులు నేడు పూర్తి చేసుకున్నామని తెలిపారు.

- Advertisement -

అంతకుముందు సైబరాబాద్ కమిషనరెట్ పరిదిలో అల్లపుర్ లో నూతన పోలీస్ స్టేషన్ ను సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయ్యి దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ రాష్ట్ర ప్రగతిని ఆవిష్కరించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుతూ… జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశమంతా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకులు అయ్యారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News