Saturday, October 5, 2024
HomeతెలంగాణBhatti: 1000 km పూర్తైన భట్టీ పీపుల్స్ మార్చ్

Bhatti: 1000 km పూర్తైన భట్టీ పీపుల్స్ మార్చ్

రాహుల్ గాంధీ జోడోయాత్ర స్ఫూర్తితో సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలుపెట్టారు

మధిర శాసన సభ సభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజక వర్గం పిప్పిరి మండలం నుండి మొదలుపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా వేయి కిలోమీటర్లు చేరుకుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేసుకొని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ జోడోయాత్ర స్ఫూర్తితో సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలుపెట్టారని అన్నారు. ఖమ్మం జిల్లా వ్యక్తిగా సిఎల్పీ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున భట్టి విక్రమార్కకు ప్రత్యేక అభినందనలను తెలిపారు. ఈ నెల 25 న ఖమ్మంలోని భారీ బహిరంగ సభతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగుస్తుందని ప్రతి కార్యకర్త సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు అతిరథ మహారథుల ఈ సభలో పాల్గొనున్నారని తెలిపారు రాష్ట్ర ఆదివాసీ సంఘం అధ్యక్షులు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ..మల్లు భట్టి విక్రమార్క కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ అధ్యక్షులు మాలోత్ రాందాస్ నాయక్ కు పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు,కాంగ్రెస్ నగర పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ వడ్డే నారాయణరావు, పుచ్చకాయల వీరభద్రం బానోత్ రాజు నాయక్,జిల్లాయడ్లపల్లి సంతోష్,శేఖర్ గౌడ్ కార్పొరేటర్లు దుద్ధుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, బాణాల లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News