తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు (GPO Posts) మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన చర్యలు త్వరగా తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరింది.
