Telangana Gaddar Film Awards 2025: తెలుగు చిత్రపరిశ్రమకి ఈ రోజు పెద్ద పండుగ రోజు. దాదాపు 14 ఏళ్ళ తర్వాత ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగ. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమలోని మూల స్థాంబాలైన మెగాస్టార్, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున హాజరవనున్నారు. ఇక ఈ ఈవెంట్లో తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ ని స్మరించుకుంటూ ఆయన పేరుతో అవార్డులను ఇవ్వనున్నారు.
దాదాపు 14 ఏళ్ళ సుదీర్గ సమయం తర్వాత 2025 లో గద్దర్ పేరుతో ఫిలిం అవార్డులను ఇవ్వనున్నారు. వాస్తవంగా చెప్పుకుంటే, గత కొన్నేళ్లుగా గద్దర్ అవార్డ్స్ ను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఎట్టకేలకు ఈరోజు (14.06.2025) సాయంత్రం అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక అవార్డు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు. కళారంగంలో అత్యంత ప్రతిభను కనపరిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ వేడుకకి హైదరాబాద్ హైటెక్స్ వేదిక అయింది.
ఎంతో ఘనంగా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న అవార్డులు కావడంతో చాలా పెద్ద లిస్ట్ నే సిద్ధం చేశారు. 2014 నుంచి2023 వరకు, తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లకి గానూ ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం ఎంతో ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత కొన్నిరోజుల నుంచి గద్దర్ అవార్డులకు రావాలని తెలుగు సినీ ప్రముఖును ఆహ్వానించారు. ఈ వేడుక కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కలిసి రానుంది. సినీ ప్రముఖులు అందరూ ఈ అవార్డ్స్ వేడుకలో పాల్గొనబోతున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి వేడుకలు జరగడం చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అంతేకాదు, సినీ ప్రముఖులందరూ తరలి రావాలంటే అంత సులభం కాదు. ఎంతో ప్రణాళికతో కూడుకున్న వ్యవహారం. మొత్తానికి చాలా ఏళ్ళ తర్వాత ఒకే వేదికపై సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ, వ్యాపారవేత్తలు కలిసి ఉండటం కన్నుల పండుగ అని చెప్పాలి. జూన్ 14 సాయంత్రం హైటెక్స్లో 6 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
2014 నుంచి 2023 వరకు బెస్ట్ త్రీ ఫిలిమ్స్ కి అవార్డ్స్ ఇస్తారు:
2014 నుంచి 2023 వరకు బెస్ట్ త్రి ఫిలిమ్స్ లో ప్రతి సినిమా నుంచి హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా నలుగురికి 2024లో ప్రకటించిన గద్దర్ అవార్డును అందజేస్తారు
ఇక ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించబోతుండటం విశేషం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి గద్దర్ అవార్డ్ ప్రకటించిది. ఈ అవార్డును అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోబోతున్నారు.