School Bus Accident: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు కిందపడి ఎల్కేజీ చదువుతున్ననాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మృతిచెందిన బాలికను జస్మిత (4)గా గుర్తించారు. బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన చిన్నారిని పాఠశాల సిబ్బంది స్తానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. పాప అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.

డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి జస్విత చనిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనకు కారణమైన నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ విజయ్ను అరెస్టు తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.


