Saturday, October 5, 2024
HomeతెలంగాణAbdullapurmet: ఇండ్లులేని పేదలకు ఇండ్ల స్థలాలు

Abdullapurmet: ఇండ్లులేని పేదలకు ఇండ్ల స్థలాలు

ఎమ్మెల్యేకి వినతి పత్రం

ఉండటానికి పక్క ఇల్లు లేని పేద ప్రజలకు పక్క ఇంటి స్థలం ఇచ్చి పట్టాలు ఇప్పించాలంటూ స్థానిక సీపీఎం నేతలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా స్థానికి సీపీఎం నేత శివకుమార్ మాట్లాడుతూ.. అబ్దుల్లపూర్ మెట్ మండల కేంద్రములో ప్రభుత్వ భూమిలో పేదలందరూ స్థానికులు ఇండ్లు లేక ఇండ్ల కిరాయిలు కట్టాలేక గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి వినతిపత్రం, ఇండ్లు లేని స్థానిక నిరు పేదల లిస్ట్ ఎమ్మెల్యేకి ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో మాట్లాడి పట్టాలు ఇప్పించే ఏర్పాటు అతి తొందరలోనే చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూర్గుల ప్రభాకర్ జాను, ప్రసాద్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News