Wednesday, January 22, 2025
HomeతెలంగాణAnjayya Yadav: ప్రజలు కేసీఆర్ తోనే, గేలుపు కేసీఆర్ దే

Anjayya Yadav: ప్రజలు కేసీఆర్ తోనే, గేలుపు కేసీఆర్ దే

మళ్లీ మాదే సర్కారు

కెసిఆర్ తోనే ప్రజలు ఉన్నారని, కేసీఆర్నే మళ్లీ గెలిపిస్తారని షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. చింతల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలని కొబ్బరికాయ కొట్టారు. ఏ ఊరికి వెళ్ళినా ప్రజలు ప్రచారానికి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ది పొందిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించి మళ్లీ కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News