Saturday, November 15, 2025
HomeతెలంగాణFire Accident: పాశమైలారంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం!

Fire Accident: పాశమైలారంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం!

Fire Accident In Pashamylaram: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆందోళన కలిగించింది. ఇటీవల సిగాచి పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఇంకా ప్రజలు మరవక ముందే, తాజాగా ఎన్విరాన్‌మెంట్ వెస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ ప్రాంగణంలో మంటలు వేగంగా వ్యాపించగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు.

- Advertisement -

అగ్ని ప్రమాదంపై ప్రాథమిక సమాచారం

ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై పూర్తి సమాచారం అందనప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ సంస్థలో జేమ్‌స్టిక్స్, ప్లాస్టిక్, రసాయన వ్యర్థ పదార్థాలు అధికంగా నిల్వలో ఉండటంతో, ఇవి వేడి కారణంగా మంటలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలు అత్యంత సులభంగా అంటుకునే లక్షణం కలిగినవిగా పరిగణించబడుతున్నాయి. వాటి కారణంగా మంటలు వ్యాపించి భారీ అగ్నిప్రమాదంగా మారి ఉండొచ్చేమో అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కొనసాగుతున్న రెస్క్యూ చర్యలు

ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది, నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. మంటలు తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, సమీపంలోని ఇతర పరిశ్రమలకూ ప్రమాదం కలిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని వారు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ తరహా వరుస ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పరిశ్రమల అభివృద్ధి స్థలంగా గుర్తింపు పొందిన పాశమైలారం ఇప్పుడు ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నట్లుగా ప్రజల్లో భావన పెరిగిపోతోంది. భద్రతా ప్రమాణాలు సరైన రీతిలో అమలవుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పర్యావరణ శాఖ, పరిశ్రమల విభాగాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. పరిశ్రమలు వ్యర్థ పదార్థాలను ఎలా నిర్వహిస్తున్నాయి? అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకుంటున్నాయా? అనే అంశాలపై సమగ్ర పరిశీలన అవసరమైంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పాశమైలారంలాంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి అవసరం అయినప్పటికీ, ప్రజల భద్రత అన్నది మరింత ముఖ్యమైన అంశం. పరిశ్రమల అభివృద్ధికి భద్రత అనేది మౌలిక అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమతుల్యతగా అభివృద్ధి సాధ్యమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad