Monday, July 8, 2024
HomeతెలంగాణSircilla District : తెలంగాణలో మరో యువతి కిడ్నాప్.. ప్రేమ వేధింపులా ?

Sircilla District : తెలంగాణలో మరో యువతి కిడ్నాప్.. ప్రేమ వేధింపులా ?

తెలంగాణలో మరో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. సినీ ఫక్కీలో.. దుండగులు యువతిని కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకుపోయారు. వైశాలి కిడ్నాప్ కేసు దర్యాప్తులో ఉండగానే మరో యువతి కిడ్నాపవ్వడం సంచలనంగా మారింది. ఈ కిడ్నాప్ వెనుక ప్రేమ వేధింపులున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లికి చెందిన శాలిని (18) అనే యువతి మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు తన తండ్రితో కలిసి పూజ చేసి బయటకు వస్తుండగా.. ఆలయం ముందుకి ఓ కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుండి దిగిన యువకులు శాలినిని చుట్టుముట్టారు.

- Advertisement -

పరిస్థితి అర్థమై వారి నుండి తప్పించుకునేందుకు పరుగుతీసింది శాలిని. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రిని ఇద్దరు బంధించారు. పారిపోతున్న శాలినిని మరో దుండగుడు వెంటాడి పట్టుకున్నాడు. తండ్రిని పక్కకు తోసి శాలినిని కారులో బంధించి తీసుకెళ్లారు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కాగా.. కొంతకాలంగా శాలిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి శాలిని ఆచూకీకోసం గాలిస్తున్నారు.

శాలిని మైనర్ గా ఉన్నప్పుడే ఊరిలో ఓ యువకుడు తనను ప్రేమించాలని వేధించేవాడని ఆమె తండ్రి తెలిపారు. అతని వేధింపులు భరించలేక విషయం ఇంట్లో పెద్దలకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, జైల్లో పెట్టారు. జైలు శిక్ష అనుభవించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని శాలిని తండ్రి పోలీసుల వద్ద వాపోయారు.

అందులో నుండి దిగిన యువకులు.. శాలినిని చుట్టుముట్టి కారులో తీసుకెళ్లిపోయారు. శాలిని వారి నుండి తప్పించుకునేందుకు తన సాయశక్తులా ప్రయత్నించింది. ఆమె తండ్రిని ఇద్దరు బంధించగా.. ఓ దుండగుడు ఆమెను వెంటాడి మరీ పట్టుకున్నాడు. యువతిని బలవంతంగా కారు ఎక్కించి.. అక్కడి నుండి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. తన కూతుర్ని కాపాడుకునేందుకు తండ్రి ప్రయత్నించినా.. ఫలించలేదు. కాగా.. శాలినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడే ఇదంతా చేసి ఉంటాడని భావిస్తున్నారు. శాలిని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News