Sunday, October 20, 2024
HomeతెలంగాణAsifabad: రైతు భరోసాపై రాస్తారోకో

Asifabad: రైతు భరోసాపై రాస్తారోకో

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా అందిస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. రైతు భరోసా, రైతు బంధు ఇచ్చేవరకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ,మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళ నాయకురాలు, రైతు సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News