Sunday, October 6, 2024
HomeతెలంగాణBalka Suman: జిల్లా అభివృద్ధికి 206.10 కోట్ల నిధులు

Balka Suman: జిల్లా అభివృద్ధికి 206.10 కోట్ల నిధులు

ఇచ్చిన మాట ప్రకారం మంచిర్యాల జిల్లా అభివృద్ధికి నిధులు

ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బిఆరెస్ పార్టీ అధ్యక్షులు డా.బాల్క సుమన్ పట్టుదలే, కృషినే జిల్లా అభివృద్ధికి నాంది పలికింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురం భీం -ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 23వ తేదీ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంచిర్యాల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు గాను జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు.. ఒక్క మున్సిపాలిటీకి 25 కోట్ల చొప్పున, జిల్లాలోని 311 గ్రామపంచాయతీ లకు గాను ఒకొక్క గ్రామపంచాయతీకి 10 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని ప్రకటించిన సందర్బంగా ఇచ్చిన మాట ప్రకారం మంచిర్యాల జిల్లా అభివృద్ధికి 206.10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News