Sunday, November 16, 2025
HomeతెలంగాణBalka Suman: రాష్ట్రానికి సింగరేణి సంస్థ మణిహారం

Balka Suman: రాష్ట్రానికి సింగరేణి సంస్థ మణిహారం

సింగరేణి ప్రగతి నివేదిక పుస్తకం ఆవిష్కరణ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రగతి నివేదిక పుస్తకాన్ని సింగరేణి సంస్థ డైరెక్టర్ బలరామ్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సింగరేణి డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పి ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, సింగరేణి డైరెక్టర్ బలరామ్, ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad