Sunday, June 8, 2025
HomeతెలంగాణBandaru Dattatreya: “బీజేపీలో స్కూల్, టీడీపీలో కాలేజీ.. ఇప్పుడు రాహుల్‌గాంధీ దగ్గర ఉద్యోగం!” సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Dattatreya: “బీజేపీలో స్కూల్, టీడీపీలో కాలేజీ.. ఇప్పుడు రాహుల్‌గాంధీ దగ్గర ఉద్యోగం!” సీఎం రేవంత్ రెడ్డి

హరియాణా గవర్నర్‌, బండారు దత్తాత్రేయ ‘ఆటో బయోగ్రఫీ’ పుస్తకావిష్కరణ – కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికగా ప్రసగించిన సీఎం. దత్తాత్రేయ జీవన విధానం స్ఫూర్తిదాయకం అంటూ వెల్లడి.

- Advertisement -

శిల్పకళా వేదికగా….


పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తి బండారు దత్తాత్రేయా అని.. తను పదవిలో ఉన్నా లేకున్నా ఆయనపై గౌరవం ఏ మాత్రం తగ్గదని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం హరియాణా గవర్నర్‌ గా విధులు నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ‘ప్రజలకథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమలో దత్తాత్రేయ జీవన శైలిని కొనియాడారు.

గౌలిగూడ టు గవర్నర్​….


గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్‌ గా బండారు దత్తాత్రేయ ఎదిగిన తీరుని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి ఆయన కు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు చేసుకునే వేడుకలకు వారి ఇంట్లో వారిలాగా భాగం అయ్యేవారని గుర్తుచేశారు. తనకు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ‘నా స్కూల్‌ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో ఉద్యోగం రాహుల్‌ గాంధీ వద్ద చేస్తున్నట్లు ఇటీవల ప్రధానికి చెప్పినట్లు పేర్కొన్నారు. నాకు ఇతర రాజకీయ పార్టీల నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఏనాడూ దాచుకోలేదన్నారు. తనకి దత్తత్రేయకు ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం ముగియగానే ఇక్కడికి వచ్చాననన్నారు. వారి విధానాల్లో ఆయన స్ఫూర్తి ఉందని తెలుపుతూ… దత్తాత్రేయ అజాత శత్రువని కీర్తించారు.

ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమానికి స్ఫూర్తి….


జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయీ ఎంతటి గౌరవం ఉందో… రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు అంతే గౌరవం ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో దత్తాత్రేయా ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జరిగే అలయ్‌ బలయ్‌ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా కీర్తించారు. నేడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు ఆయన జీవితం నుంచి ఆయన జీవన వ్యవహార శైలిని నేర్చుకోవాలని సూచించారు. జంటనగరాల్లో ప్రజలకు కష్టం గుర్తుకు వచ్చే నాయకుల్లో పీజేఆర్‌, దత్తాత్రేయ ముందు వరుసలో ఉంటారన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి ఈ వేదిక గవర్నర్‌ల పరేడ్‌లా ఉందన్నారు. మంత్రివర్గ సమావేశం ఇక్కడే పెట్టుకునేలా… కాంగ్రెస్‌లో ఉన్న మంత్రివర్గం దాదాపుగా అక్కడే ఉందని సీఎం ఛలోక్తి విసిరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News