Tuesday, September 17, 2024
HomeతెలంగాణTelangana : కేసీఆర్ పై హత్య కేసు పెట్టాల్సిందే : బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Telangana : కేసీఆర్ పై హత్య కేసు పెట్టాల్సిందే : బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు రెండ్రోజుల క్రితం భద్రాద్రి జిల్లాలోని గుత్తికోయల దాడిలో మరణించిన విషయం తెలిసిందే. శ్రీనివాసరావుది ముమ్మాటికే ప్రభుత్వ హత్యేనని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అవే ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ పై తక్షణమే హత్య కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

- Advertisement -

గురువారం వేములవాడలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ ఆరోపణలు చేశారు. అలాగే మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులపై స్పందించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్రాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

ఐటీ, సీబీఐ, ఈడీ దాడులపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు. ప్రజలను రాచిరంపాన పెట్టి అడ్డగోలుగా, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్లను కంట్రోల్ చేయాలా? వద్దా? అని మీడియా ముఖంగా ప్రశ్నించారు. అవినీతి పరులు తప్పించుకోవడానికి తమ నోటికొచ్చిన విమర్శలు చేయడం సిగ్గు చేటన్న బండి సంజయ్.. బీజేపీ ఎంపిపై కూడా సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు దాడులు చేశాయన్నారు. వాటికి రాజకీయాలతో పనిలేదని, అవి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News