Sunday, October 6, 2024
HomeతెలంగాణBasheerabad: అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పైలట్ రోహిత్ రెడ్డి

Basheerabad: అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పైలట్ రోహిత్ రెడ్డి

బషీరాబాద్ మండలం కోర్విచెడ్ గ్రామంలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ దాత, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడం మంచిదన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ విగ్రహం దేశంలో ఎక్కడలేని విధంగా అతిపెద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాద్ లో ప్రతిష్టించారన్నారు. తాండూరు నియోజకవర్గంలో ప్రతి పల్లెలో అంబేద్కర్ విగ్రహం ఉండాలని అన్నారు. ఇప్పటికీ 135 విగ్రహాలను తాండూరు నియోజకవర్గంలో ఇప్పించినట్టు తెలిపారు. రాజ్యాంగం రాసిన ఆశాజ్యోతి బాబా సాహెబ్ గారు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ కోర్విచెడ్ లో విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ జి.యాదయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు. ఎండి మైనుద్దీన్, మారుతి, శానప్ప, మునేందర్, చంద్రప్ప, కిష్టప్ప, సుందరప్ప, పిఎసిఎస్ డైరెక్టర్ నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుర్వ హనుమప్ప, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, నర్సిరెడ్డి, రాము నాయక్, గోపాల్ రెడ్డి, మునీందర్ రెడ్డి, రంగారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రజాక్, యూత్ ప్రెసిడెంట్ తాహెర్ బాండ్, వైస్ ప్రెసిడెంట్ నితిన్, ఎస్సీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ నరేష్, పవన్ ఠాగూర్, దన్ సింగ్, తిరుపతి, కోటప్ప, శివ, చందర్, ఎంపిటిసి, అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News