Sunday, October 6, 2024
HomeతెలంగాణBellayya Naik: నన్ను ఎంపీగా చూడాలనుకుంటున్నారు

Bellayya Naik: నన్ను ఎంపీగా చూడాలనుకుంటున్నారు

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చే దమ్ముంది

ఏ అధికారం, పదవి లేకుండానే హక్కుల కోసం, తండాల గ్రామ పంచాయతీ కోసం కొట్లాడి సాధించిన తనను ఎంపిగా పంపితే ప్రతి గిరిజన తండాలకు 2-5 కోట్ల వరకు నిధులు మంజూరు చేపించే సత్తా నాకుందన్నారు డాక్టర్ బెల్లయ్య నాయక్. మహబూబాబాద్ పార్లమెంట్ కేంద్రంలో డాక్టర్ బెల్లయ్య నాయక్ క్యాంప్ ఆపీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. అధిష్ఠానం ఎంపిగా అవకాశం కల్పిస్తామన్నారు.

- Advertisement -

ఇక్కడ పట్టున్నది నాకు మాత్రమే
కచ్చితంగా నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎంపి టికెట్ ఇస్తుందని నమ్మకముంది, కానీ నా అభ్యర్థితత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మీపై వుందని వ్యాఖ్యానించారు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం రాజీ లేని ఉద్యమాలు చేశా, పార్టీ లైన్ లో నడుస్తున్నా. ఈ మహబూబాబాద్ పార్లమెంట్ పై క్లుప్తంగా పట్టు వున్న ఏకైక వ్యక్తి నేనే – గతంలో బయ్యారం ఉక్కు కోసం పాదయాత్ర చేసిన చరిత్ర వుంది, అది మీ అందరికీ తెలుసు. నన్ను పార్లమెంట్ కు పంపిస్తే 100 శాతం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేంత వరకు కొట్లాడుతా – ప్రజలకు న్యాయం చేస్తా. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అన్నారు.

ఈ సమావేశంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకట్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బోడ రవి నాయక్, మాజీ జెడ్పిటిసి సభ్యులు జన్నారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ పట్టణ అధ్యక్షులు ముల్లంగి ప్రతాపరెడ్డి, యుగంధర్ రెడ్డి, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News