Sunday, September 8, 2024
HomeతెలంగాణBhupalapalli: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

Bhupalapalli: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

ప్రతి కార్యకర్త సైనికులుగా పని చేయాలి

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేసి భారీ మెజారిటీ సాధించటంలో కీలకపాత్ర పోషించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర. సత్యనారాయణరావు అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైనికుల మాదిరిగా కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి ఏదో విధంగా సహాయం చేసే విధంగా కృషి చేస్తానని ఆయన కార్యకర్తలకు భరోసా నిచ్చారు. ఈ సన్నాహక సమావేశానికిముఖ్య అతిథులుగా సుజాత పాల్ తో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి ఇన్చార్జి టిపిసిసి మీడియా కమ్యూనికేషన్ ప్రొఫెసర్ కత్తి. వెంకటస్వామి, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఓబిసి టిపిసిసి అధికార ప్రతినిధి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్చార్జి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర.సత్యనారాయణరావు స్ట్రేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత.ప్రకాష్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలే పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల ,జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News