Monday, June 16, 2025
HomeతెలంగాణBJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

BJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Bhupathi Raju Srinivasa Varma Comments: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. కొంతకాలంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా బీజేపీలో పార్టీ విలీనానికి ప్రతిపాదనలు వచ్చాయని చెప్పడం సంచలనంగా మారింది. అయితే తాను ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదని బాంబ్ పేల్చారు. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు తీవ్రం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనంటూ ఆరోపణలు చేస్తూ ఉంటారు.

2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కమలం పెద్దలు డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీలు ఉన్నప్పుడల్లా తెలంగాణలో పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి గులాబీ పార్టీలో పొత్తు పెట్టుకోవడం లేదా విలీనం చేసుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇందుకు గులాబీ బాస్ కేసీఆర్ కూడా సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితపై కేసులు నమోదైనందున వాటి నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో రాయబారం మంతనాలు జరుపుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలకు ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో బీఆర్ఎస్ హవా తగ్గిపోయిందని.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే బలమైన పార్టీలుగా ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కాషాయం కండువాలు కప్పుకుంటారని చెప్పారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని.. భవిష్యత్తులో మీరే చూస్తారంటూ వెల్లడించారు. దీంతో శ్రీనివాస వర్మ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.





సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News