వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు వెళ్లే వాహనాలను నిలిపివేయడం చట్ట విరుద్ధమని.. ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మరియు జిల్లా అధ్యక్షుడు తాత మధు ఈ మేరకు స్పందించారు. ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తున్న స్కూల్ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను సభకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం సరికాదని వారు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన సభలను అడ్డుకున్నది తాముకాదని, అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న, నేడు మంత్రి పదవులు, ఎమ్మెల్యే స్థానం సంపాదించిన వ్యక్తులే ఆ చర్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. మేము ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నాం. ఇటువంటి చట్ట విరుద్ధ చర్యలు అధికార పార్టీకి మేలు చేయవు అని నేతలు హెచ్చరించారు.