Sunday, July 13, 2025
HomeతెలంగాణKTR: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదు: కేటీఆర్

KTR: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదు: కేటీఆర్

KTR Criticizes CM Revanth reddy: సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్ రెడ్డి ఘోర వైఫల్యం చెందారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీార్ తీవ్ర విమర్శలు చేవారు. రేవంత్ చేతకానితనం వల్లే వరుసగా జూరాల ప్రాజెక్టుకు, మంజీరా బ్యారేజీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని విమర్శించారు. జూరాల ప్రాజెక్టును డేంజర్ లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు.

స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కనపెట్టడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కూడా చరిత్రలో లేనంత వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే, ఇప్పుడు మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు వచ్చాయన్నారు. ఆఫ్రాన్ కొట్టుకుపోవడం, స్పెల్ వేలోని భాగాలు కూడా దెబ్బతిన్నట్టు ఎస్డీఎస్ఏ నివేదిక గుర్తించినా ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడకపోవడం మరో దుర్మార్గంమని ధ్వజమెత్తారు.

నిన్నటిదాకా ఎన్డీఎస్ఎ నివేదిక చెప్పినా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయకపోవడం, నేడు ఎస్డీఎస్ఓ నివేదిక అందినప్పటికీ మంజీరా బ్యారేజీ మరమ్మత్తులు చేపట్టకపోవడం ఈ కాంగ్రెస్ సర్కారు దుర్మార్గపు వైఖరికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో పైనుంచి మంజీరాలో వరద ఉధృతి పెరిగితే మరింత కోతకు గురై చివరికి డ్యామ్ ను కూడా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మాని అటు మేడిగడ్డ బ్యారేజీని, ఇటు మంజీరా బ్యారేజీని వెంటనే రిపేర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ సర్కారుపై ఉందన్నారు.

బ్యారేజీల సామర్థ్యానికి మించిన వరద వచ్చిన సందర్బాల్లో ఆ ఒత్తిడిని తట్టుకోలేకే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్ఓ గుర్తించిందన్నారు. సరిగ్గా మేడిగడ్డ వద్ద కూడా ఊహించని వరద పోటెత్తడం వల్ల అక్కడ కూడా ఇదే తరహాలో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కలిసి బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడానికి ఈ అంశాన్ని భూతద్దంలో చూపించాయని ఆయన అన్నారు.

మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పియర్స్ కు వచ్చిన పగుళ్లపై నానాయాగీ చేసిన కాంగ్రెస్-బీజేపీ నేతలు మంజీరా బ్యారేజీ పిల్లర్లకు వచ్చిన పగుళ్లపై కనీసం స్పందించకపోవడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీల్లో స్వల్ప రిపేర్లు వస్తే, అప్పటికప్పుడు వాటిని మరమ్మత్తు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారే తప్ప కాళేశ్వరంపై కక్షగట్టినట్టు ఏ ప్రభుత్వాలు గతంలో వ్యవహరించలేదని గుర్తు చేశారు. పరిపాలన చేతకాక కేవలం రాజకీయ కక్షసాధింపులతో కాలం వెల్లదీస్తున్న ఈ ముఖ్యమంత్రి మంజీరా, మేడిగడ్డ వంటి తాగు సాగునీటి బ్యారేజీలను రిపేర్లు చేయకుండా వదిలేస్తే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సర్కారును చరిత్ర ఎప్పటికీ క్షమించదని కేటీఆర్ వెల్లడించారు.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News