బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోఫినాథ్(Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన వారం క్రితం కూడా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర ముఖ్య నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.
అలాగే మాగంటి ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. మాగంటి వెంటిలేటర్ పై ఉన్నారని.. ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నారని వైద్యులు ప్రకటించారు. మరోవైపు మాగంటి ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని హరీశ్ రావు కూడా తెలిపారు.