Tuesday, September 17, 2024
HomeతెలంగాణKommuri: బిఆర్ఎస్ అవినీతిపరులను ఓడించండి

Kommuri: బిఆర్ఎస్ అవినీతిపరులను ఓడించండి

నగామ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి

కబ్జా కోరులు అవినీతిపరులను ఓడించంచాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలన్నీ నెరవేరుస్తామని మాజీ ఎమ్మెల్యే, జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. రాంపురం, ఆకునూరు, కాశెగుడిసెలు, కొత్త దొమ్మాట, సుందరయ్య నగర్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. బోనాలు, బతుకమ్మలు, పీరీలు, మంగళ హారతులు, డప్పు చప్పుళ్ళతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి మోసం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని ప్రజలు గమనించి ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల లోపు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమ్ము రవి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్, మాజీ జడ్పీటీసీ కొమ్మూ నర్సింగ రావు, ఉడుముల భాస్కర్ రెడ్డి, రామగల పరమేశ్వర్, పుర్మ ఆగం రెడ్డి, వెలుగల రఘువీర్, సిపిఐ జిల్లా నాయకుడు ఈరి భూమయ్య, కుడిక్యాల బాల్ మోహన్, కత్తుల భాస్కర్ రెడ్డి, పొన్నబోయిన మమత, తోళ్ల రాజేశ్వరి, ఎండి హైమద్, జంబుల వెంకటరెడ్డి, సూర రాజు, రంగు శివ శంకర్, రంగు తిరుపతి, భూమని బాల్ రాజు, బండారి సిద్దయ్య, బండారి కనకయ్య, సకినాల బాల్ రాజు వెయ్యి మంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News