Friday, September 20, 2024
HomeతెలంగాణBRS: బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్

BRS: బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, సైది రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రవీంద్ర కుమార్బీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పైసలు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నా అని అహంకారమో, చంద్రబాబు ఏజంటనో అనుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తిడితే పబ్లిసిటీ వస్తుందని రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. జేఏసీ అంటే జానారెడ్డి యాక్షన్ కమిటీ అని ఆయన అన్నారు. కోమటి రెడ్డి అపుడు వైఎస్ బూట్లు నాకారు.. ఇపుడు మోడీ బూట్లు నాకుతున్నారని ….ఎంపీ లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు మోకాళ్ళ మీద నడిచినా ఆ పార్టీకి నల్లగొండలో డిపాజిట్లు రావన్నారు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News