Thursday, June 12, 2025
HomeతెలంగాణMahesh Kumar: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar) పార్టీ ఓబీసీల ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా కలిశారు. అనంతరం ఆయ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించామన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, జై బాపు, జై భీమ్‌ కార్యక్రమాల గురించి ఆయనకు వివరించినట్లు చెప్పారు.

- Advertisement -

వీలైనంత త్వరగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయాలని కోరానని తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కేబినెట్‌లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఒకట్రెండు రోజుల్లో టీపీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందని మహేశ్‌కుమార్‌ గౌడ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News