Friday, September 20, 2024
HomeతెలంగాణChalla Dharmareddy: కెసిఆర్ 17 భరోసాలే బెస్ట్

Challa Dharmareddy: కెసిఆర్ 17 భరోసాలే బెస్ట్

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు డమ్మీ

బి.ఆర్.ఎస్.పార్టీ మేనిఫెస్టో ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు డమ్మీ అయిపోయాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలం
కొమ్మాల, విశ్వనాధపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన చల్లా ధర్మారెడ్డికి ఆ గ్రామాల ప్రజలు మంగళ హారతులతో, డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు.
అనంతరం చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని కేసీఆర్ భరోసాలో పొందుపరిచిన 17 హామీలనే ప్రజలు నమ్ముతున్నారన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బారాస అధికారంలోకి రాగానే 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందుతుందని, ఆసరా పింఛన్ 5000 కు పెరుగుతుందని, వికలాంగుల పింఛన్ 6000 కు పెంచుతామని, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు.తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందడంతో పాటు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 అందుతాయన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే మూడు గంటలు కరెంటు వస్తుందని కారు గుర్తుకు ఓటేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ జెండా రెపరెపలాడేలా సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బి.ఆర్.ఎస్.నాయకులు కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News