Monday, June 23, 2025
HomeతెలంగాణChautuppal: ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి

Chautuppal: ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి

మొగుదాల రమేష్ గౌడ్

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మొగుదాల రమేష్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ కేంద్రంలోని19వ, వార్డులో జేల్ల కవితకి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి 60 వేల రూపాయల చెక్కును బాధితులకు అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరంతరం కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చెరుకు లింగస్వామి గౌడ్, వెల్తూరి రాములమ్మ, వెల్తూరి రాజేష్, అమృతం దశరథ, కందగట్ల మధు, సురేష్, గణేష్, మహేష్, గోపి, సంతోష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News