Sunday, September 1, 2024
HomeతెలంగాణChautuppal: 5 లక్షల బీమా చెక్కు అందజేత

Chautuppal: 5 లక్షల బీమా చెక్కు అందజేత

జనసేన క్రియాశీలక సభ్యులు సంగం చంద్ర శేఖర్ చౌటుప్పల్ లో ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను కుటుంబానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చేతుల మీదుగా హైద్రాబాద్ లోని కేంద్ర పార్టీ కార్యాలయంలో బీమా చెక్కును అందచేశారు.

- Advertisement -

మునుగోడు నియోజకవర్గంలో 300 పైగా జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వాలు నమోదుకు కృషి చేసిన మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ పర్నెశివారెడ్డిని నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను, కార్యకర్తలను కనుపాపలాగా కాపాడుకుంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, రాధ రాజలింగం, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ గోకుల రవీందర్ రెడ్డి జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News