వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం కేసులో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు రమేష్ బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చెన్నమనేని రమేష్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
పదిహేనున్నర సంవత్సరాల పాటు రమేష్ బాబు పౌరసత్వంపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా రమేష్ బాబు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారు. దీనిపై హైకోర్టు 30 లక్షల జరిమానా విధించింది. ఇందులో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు, మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి 5 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశింది. ఈ చెల్లింపును నెల రోజుల్లో పూర్తిచేయాలని చెన్నమనేని రమేష్ కు హైకోర్టు ఆదేశం జారీ చేసింది.