Friday, September 20, 2024
HomeతెలంగాణChennuru: కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న బీజేపీ, బీఆర్ఎస్ యువత

Chennuru: కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న బీజేపీ, బీఆర్ఎస్ యువత

యువతకు చేసింది ఏమి లేదు

చెన్నూర్ నియోజకవర్గం మందమర్రి మండలం బీజేపీ, బీఆర్ఎస్ యువత డాక్టర్ రాజా రమేష్ అధ్వర్యంలో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మందమర్రి బీజేపీ మాజీ యూత్ ప్రెసిడెంట్ గుడికందుల హరినాథ్ వారి మిత్రులు, పులిమడుగు నుండి సూరి, శ్రీకాంత్ వారి మిత్రులు సుమారు 20 మంది యువత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో డాక్టర్ రాజా రమేష్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో మరీముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో యువతకు చేసింది ఏమి లేదు. వారి బ్రతుకులతో ఆడుకోవడం తప్ప మరోటి లేదు. స్వతహాగ విద్యార్థి నాయకుడైన బాల్క సుమన్ స్త్నానిక యువతకు చేసింది ఏమి లేదన్నారు. ఎవ్వరినీ పట్టించుకున్న దాఖలాలు లేవు ఇది నగ్న సత్యం పైగా వారికి లేని పోని ఆశలు చూపించి వారి ఆవేశాన్ని ఆసరాగా చేసుకొని చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసి.. కాంగ్రెస్ పార్టీలో సేవకుడు డాక్టర్ రాజా రమేష్ సమక్యంలో చేరమని తెలుపడం జరిగింది. ఎంతో కష్టపడి హైదరాబద్ లో తిండి లేఖ నాన తిప్పలు పడుతూ గ్రూప్ పరీక్షలకు కోచింగ్ తీసుకొని పరీక్ష రాస్తే పరీక్ష పత్రాలు లీక్ చేసి మళ్లీ దాని గురించి పట్టించుకున్న నాయకుడే లేడు. ఆకలితో ఉన్న పేదల బ్రతుకుల గురించి కడుపు నిండి, బ్యాంకులలో డబ్బు కూడ బేట్టుకున్న నాయకులకు ఏమీ అర్థం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు, రైతులు, యువత, విద్యార్థులు బారి సంఖ్యలో ఆందోళన చేసే అవకాశం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోపతి రాజయ్య, మందమర్రి మండల అధ్యక్షులు కడారి జీవన్, జైపూర్ మండల్ యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ వార్డ్ మెంబర్ ఉప్పలపు సురేష్, మహేష్, కిరణ్, వంశీ, నరేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News