Tuesday, September 17, 2024
HomeతెలంగాణCheryala: కేసీఆర్ తోనే గ్రామాభివృద్ధి

Cheryala: కేసీఆర్ తోనే గ్రామాభివృద్ధి

గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో పేదలకు ఇండ్ల పంపిణీ చేసుకుందామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మండలంలోని పాత దొమ్మాట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపింని చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. చేర్యాల వాసవి గార్డెన్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, చీఫ్ మినిస్టర్ కప్ ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ సుంకర మల్లేశం, వైస్ పుర్మా వెంకట్ రెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతల మల్లేశం, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల నరసయ్య, మండల నాయకులు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News