Sunday, July 7, 2024
HomeతెలంగాణChevella: తలారం గ్రామంలో 'శుభోదయం' పునఃప్రారంభం

Chevella: తలారం గ్రామంలో ‘శుభోదయం’ పునఃప్రారంభం

చేవెళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలె యాదయ్య తలపెట్టిన ‘శుభోదయం’ కార్యక్రమం తలారం గ్రామంలో పునః ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ సురేందర్ అధ్యక్షతన ఎమ్మెల్యే యాదయ్య అయ్యప్ప ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ వారి సహకారంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్పంచ్ సురేందర్ కు గ్రామపంచాయతీ పరిసర ప్రాంతంలో వర్షం నీరు నిలవడం చూసి వాటిని మట్టితో పూడ్చాలన్నారు. అనంతరం అనుబంధ గ్రామం దుద్దాగులో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. తలారం దుద్దాగు గ్రామ విధులు తిరిగి ప్రజలనడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరు ఆరా తీశారు. గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా శుభోదయం కార్యక్రమం సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ రెడ్డి వైస్ చైర్మన్ నర్సింలు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రవీందర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ గని గ్రామ వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News