Saturday, November 15, 2025
HomeతెలంగాణChevella: కాలే యాదయ్యకు 50,000 ఎన్నికల ఫండ్ విరాళమిచ్చిన దండు మల్లమ్మ పెంటయ్య

Chevella: కాలే యాదయ్యకు 50,000 ఎన్నికల ఫండ్ విరాళమిచ్చిన దండు మల్లమ్మ పెంటయ్య

ఎన్నికల ఖర్చుకు విరాళాల వెల్లువ

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం గురువారం చేవెళ్ళ పట్టణం కేంద్రంలో కొనసాగింది. స్థానిక ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర్ రెడ్డి జెడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి స్థానిక బిఆర్ఎస్ నేతలతో కలిసి చేవెళ్ళ నియోజకవర్గ అభ్యర్థి కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం చేశారు. చేవెళ్ల గ్రామం మొదలుకొని పట్టణంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ… ఓటర్లను కలిశారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న కారు గుర్తుకు ఓటేసి ముఖ్యమంత్రిగా మరోసారి కెసిఆర్ ను నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా చేవెళ్ళ గ్రామానికి చెందిన దండు మల్లమ్మ భర్త పెంటయ్య ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్యకు ఎన్నికల ఖర్చు నిమ్మితం 51,116 రూపాయల చెక్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad