Saturday, November 15, 2025
HomeతెలంగాణChevella: సిఎం సారు..అభివృద్ధికి నిధులివ్వండి

Chevella: సిఎం సారు..అభివృద్ధికి నిధులివ్వండి

వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన మర్యాద పూర్వకంగా కలిసి చేవెళ్ళ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు. నియోజకవర్గ ప్రాంతంలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad