Saturday, November 15, 2025
HomeతెలంగాణChevella: మంత్రిచే ఉత్తమ అవార్డు పొందిన నర్సులు

Chevella: మంత్రిచే ఉత్తమ అవార్డు పొందిన నర్సులు

మంత్రి సబిత చేతుల మీద అవార్డు

చేవెళ్ల డివిజన్ టంగుటూరు షాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న కంభంపాటి ధనలక్ష్మి, శనిగల సౌజన్య విధి నిర్వహణలో నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేశారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య కేంద్రం గూర్చి కమ్యూనికేట్ చేసిన విధానాన్ని గుర్తించి ప్రభుత్వం వారికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందజేశారు. డివిజన్లో ఇద్దరికీ ఉత్తమ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ దామోదర్ అన్నారు. మిగతా సిబ్బంది ఈ అవార్డు అందుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad